ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వంగపండు కీలక పాత్ర- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-04T21:34:11+05:30 IST

ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి పముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు అని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వంగపండు కీలక పాత్ర- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి పముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు అని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆయన మృతికి ఎర్రబెల్లి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏంపిల్లడో ఎల్ధామొస్తవా....అంటూ ప్రజలను చైతన్య పరిచిన ప్రజల పాట వంగపండు అన్నారు. ఎల్దామొస్తవా అంటూ తానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందినవాడైనా తెలంగాణకు మద్దతు పలికిన వంగపండును తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. విప్లవోద్యమమైనా, ప్రజల పాటైనా తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకూ కట్టుబడిన వ్యక్తి వంగపండు అని చెప్పారు. వంగపండు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్ధించారు. 


Updated Date - 2020-08-04T21:34:11+05:30 IST