వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-09-11T20:24:13+05:30 IST

చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

వరంగల్: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వేయి స్తంభాల గుడి లో నవరాత్రి ఉత్సవాలనేపధ్యంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడి లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం సంతోషంగా వుందన్నారు. 


కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని,తెలంగాణ ప్రజలు  సుఖ,సంతోషాలతో ఆనందంగా ఉండాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. సీఎం కేసిఆర్ కృషితో రామప్ప ను ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల గుడి ని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసిఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. ఈ ఏడేళ్ల లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-11T20:24:13+05:30 IST