వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం:మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-04-20T01:42:42+05:30 IST

వచ్చేమున్సిపల్ ఎన్నికలతో ప్రతిపక్షాలు అడ్రస్ గల్లంతు అవడం ఖాయం అని, టీఆర్ఎస్-కేసీఆర్ జోలికి పోవద్దని ప్రతిపక్షాలకు గుణపాఠం రావాలి.

వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం:మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ: వచ్చేమున్సిపల్ ఎన్నికలతో ప్రతిపక్షాలు అడ్రస్ గల్లంతు అవడం ఖాయం అని,  టీఆర్ఎస్-కేసీఆర్ జోలికి పోవద్దని ప్రతిపక్షాలకు గుణపాఠం రావాలి. అన్ని సర్వేలలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని 66 డివిజన్లను టీఆర్ఎస్ క్లిన్ స్వీప్ చేయబోతున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా ఈ ఎన్నికలను అషామాషిగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ గా తీసుకుని పని చేయాలని ఆయన ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. హసన్ పర్తి లోని కెఎల్ఎన్ గార్డెన్స్ లో, హన్మకొండలోని  మయూరి గార్డెన్స్ లో కార్పొరేషన్ పరిదిలోని 66 డివిజన్ల పార్టీ ఇంచార్జ్ లతో ఎర్రబెల్లి సమీక్ష జరిపారు.


ఈ సందర్భంగా మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరై నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీప్ దాస్యం వినయ్ బాస్కర్, పలువురు ఎంఎల్ఏలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు  మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ తో గెలుస్తుందన్నారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి అన్ని డివిజన్ల అభ్యర్థులను బంపర్ మెజార్టీ తో గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలన్నారు.


ఈ పది రోజులు తామే అభ్యర్థుల లాగా మిషన్ మోడ్ లో పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అసలు చోటే లేదని అన్నారు. వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. అన్ని డివిజన్లలో ప్రతి ఓటర్ ను కలిసి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దామ్. ప్రతిపక్షాల బండారాన్ని బయట పెడదాం. ముఖ్యంగా బీజేపీ అబద్ధాలు, అసత్యాల ప్రచారాలను తిప్పి కొట్టాలని మంత్రులు చెప్పారు. నగరాన్ని అభివృద్ది చేసేది, చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ యే నని ప్రజలు నమ్ముతున్నారు. అందరి కృషి వల్ల పార్టీ  ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమాల్లో ఇంకా ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఒడితెల సతీష్ కుమార్, గండ్ర వెంకటరమణా రెడ్డి, సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, టీఎస్ఐఐసి చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జెడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, బిందు, రాష్ట్ర నాయకులు జన్ను జకార్య తదితరులు మాట్లాడారు.

Updated Date - 2021-04-20T01:42:42+05:30 IST