బీజేపీ మేనిఫెస్టో ఓ జోక్: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-10-27T03:22:21+05:30 IST

ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం

బీజేపీ మేనిఫెస్టో ఓ జోక్: మంత్రి హరీష్‌రావు

హుజురాబాద్: ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీ నేత తరుణ్‌చుగ్ విడుదల చేసిన మేనిఫెస్టో ఓ జోక్ అని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేసారు. ఓటమి నిస్పృహతో సెంటిమెంట్ రగిల్చేందుకు దాడులు, కుట్రలు, డ్రామాలకు బీజేపీ తెర లేపుతన్నదని హరీష్‌రావు ఆరోపించారు. పదవులు ఇచ్చి ఈటల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేసారు. పనులు చేయక హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఈటల అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 


Updated Date - 2021-10-27T03:22:21+05:30 IST