బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదు: మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2021-07-31T20:53:26+05:30 IST

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదు: మంత్రి కొప్పుల

కరీంనగర్: బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం జమ్మికుంట పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ముహమా బీజేపీ నాయకులది అని ఎద్దేవా చేశారు. రెండు వేలు ఇవ్వలేని వాళ్లు రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏం మాట్లాడారని ప్రశ్నించారు. వందలాది సంవత్సరాలుగా వెనుక బడి ఉన్న కులాలకు దళిత బంధు ఒక వరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 

Updated Date - 2021-07-31T20:53:26+05:30 IST