మంత్రి శంకర్‌నారాయణకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2020-08-10T21:13:24+05:30 IST

అనంతపురం: రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. జీడిపల్లి రిజర్వాయర్ వద్ద గంగ పూజలో మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు.

మంత్రి శంకర్‌నారాయణకు చేదు అనుభవం

అనంతపురం: రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. జీడిపల్లి రిజర్వాయర్ వద్ద గంగ పూజలో మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. రిజర్వాయర్ నిండకుండా చెరువులకు నీటిని ఎలా విడుదల చేస్తారంటూ మంత్రితో రైతులు వాగ్వాదానికి దిగారు. భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో నాలుగు గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయని.. రిజర్వాయర్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చామన్నారు. రిజర్వాయర్ పూర్తిగా నిండకుండా చెరువులకు నీటిని విడుదల చేయకూడదని రైతులుచెబుతున్నారు. 

Updated Date - 2020-08-10T21:13:24+05:30 IST