అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం
ABN , First Publish Date - 2020-02-22T19:03:35+05:30 IST
అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం
తూ.గో: ఇసుక పాలసీ అమలు విషయంలో అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల అధికారులపై మంత్రి పిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంలో క్షేత్రాస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని...అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి ఆగ్రహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ మురళీధర్రెడ్డి హాజరయ్యారు.