రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా
ABN , First Publish Date - 2020-03-30T21:41:21+05:30 IST
రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్: రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం కొత్తపేట చౌరస్తాలో ఉన్న రైతు బజార్ను తాత్కాలికంగా విశాల ప్రదేశమైన విక్టోరియా మెమోరియల్ హోమ్ మైదానంలోకి మార్చారు. ఈ తాత్కాలిక రైతు బజారు ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రజలందరూ ఒకే చోట గుంపులు గుంపులు ఉండకుండా, కూరగాయలు కొనుక్కొని నేరుగా ఇంటికి వెళ్లే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా విఎంహోమ్లో ఉండే అనాధ పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కరోనా మహమ్మారి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, ఇలాంటి సందర్భంలో స్వచ్చంధ సంస్థలు కూడా ప్రజలకు సహాయపడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.