బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశాం: మంత్రి తలసాని
ABN , First Publish Date - 2021-08-01T17:00:46+05:30 IST
బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశాం: మంత్రి తలసాని
హైదరాబాద్: బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశామని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరమే బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని తలసాని తెలిపారు. రేవు రంగం కార్యక్రమం తర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని తలసాని పేర్కొన్నారు. తొలిసారి ప్రైవేట్ ఆలయాలకు నిధులు ఇచ్చామని తలసాని చెప్పారు. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని తలసాని స్పష్టం చేశారు.