బస్తీ దవాఖానలుగా కమ్యూనిటీ హాళ్లు: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-08-15T02:51:51+05:30 IST

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ వ్యక్తుల, స్థానిక అసోసియేషన్ల ఆధీనంలో ఉన్న కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకుని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్

బస్తీ దవాఖానలుగా కమ్యూనిటీ హాళ్లు: మంత్రి తలసాని

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ వ్యక్తుల, స్థానిక అసోసియేషన్ల ఆధీనంలో ఉన్న కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకుని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ముషీరాబాద్ నియోజకవర్గం, బోలక్‌పూర్ డివిజన్ గాంధీనగర్‌లో, అడిక్‌మెట్ పోచమ్మ బస్తీలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అడిక్‌మెట్ కార్పొరేటర్ హేమలత రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 195 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మొత్తం 300 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2020-08-15T02:51:51+05:30 IST