ఇందిరాపార్క్ వద్ద ధర్నాపై సమాధానాన్ని దాటవేసిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-11-10T16:34:08+05:30 IST

నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వ తలపెట్టిన ఆందోళనపై మంత్రి తలసాని సమాధానం చెప్పకుండా దాటవేశారు.

ఇందిరాపార్క్ వద్ద ధర్నాపై సమాధానాన్ని దాటవేసిన మంత్రి తలసాని

హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వ తలపెట్టిన ఆందోళనపై మంత్రి తలసాని సమాధానం దాటవేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం విషయంలో ఇందిరా పార్కు వద్ద ఎలా ధర్నా చేస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రనికి  స్పష్టత లేదన్నారు. దమ్ముంటే  బీజేపీ నేతలు కేంద్రమే వడ్లు కొంటుందని రాష్ట్ర ప్రభుత్వనికి లేఖ ఇవ్వాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల మద్దతు కూడగడుతామని తెలిపారు. తమ టీఆర్ఎస్‌ ఎంపీలు వచ్చే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

Updated Date - 2021-11-10T16:34:08+05:30 IST