కనుకదుర్గ అమ్మవారికి మంత్రి వెల్లంపల్లిచే ముత్యాలహారం అందజేత

ABN , First Publish Date - 2021-03-27T23:55:43+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కొండపై కొలుువుదీరిన కనుకదుర్గ అమ్మవారికి

కనుకదుర్గ అమ్మవారికి మంత్రి వెల్లంపల్లిచే ముత్యాలహారం అందజేత

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొండపై కొలుువుదీరిన కనుకదుర్గ అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముత్యాలహారం సమర్పించారు. తన కుమార్తె అశ్విత పుట్టినరోజు సందర్భంగా మంత్రి వెల్లంపల్లి ఈ ముత్యాలహారాన్ని ఆలయ అధికారులకు అందించారు. 16 లక్షల రూపాయల విలువ గల ముత్యాలహారాన్ని అమ్మవారికి మంత్రి సమర్పించారు. మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వెల్లంపల్లి కుమార్తెను ఆశీర్వదించడానికి నగర మేయర్, పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, తదితరులు  వచ్చారు. 

Updated Date - 2021-03-27T23:55:43+05:30 IST