తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్:తలసాని

ABN , First Publish Date - 2021-08-11T20:46:21+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని పోరాడిన నాయకులు గెల్లు యాదవ్ అని, ఆయనను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మంత్రి తలసాని నివాస్యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్:తలసాని

 హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని పోరాడిన నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, ఆయనను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పోరాడినందుకే పార్టీ ఆయనను గుర్తించిందని అన్నారు. హుజూరాబాద్ అభ్యర్ధిగా గెల్లును ప్రకటించిన నేపధ్యంలో మంత్రి తలసాని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ అని, బహుజనుల బిడ్డ గెల్లును పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం మంచి పరిణామమని అన్నారు.


 టీఆర్ఎస్ పార్టీలో అంకితభావంతో పని చేసే వారికి సరైన గుర్తింపు వస్తుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. సామాజిక న్యాయం చేయాలని ముఖ్యమంత్రి భావించడం బీసీల అభివృద్ధి నాంది అన్నరు. హుజురాబాద్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా గెల్లు పేరు పొందారని పేర్కొన్నారు. బీజేపీ హుజురాబాద్ లో గెలిస్తే రెండు కాస్త మూడు అవుతాయి. అంతే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ గెలుస్తే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి అంతా పూర్తి అవుతుందన్నారు. నాగార్జున సాగర్ ఫలితాలే రేపు హుజురాబాద్ లో రిపీట్ అవుతాయని మంత్రి తలసాని జోస్యం చెప్పారు. సర్వేలన్ని టీఆర్ఎస్ కు  అనుకూలంగా ఉన్నాయి.


 కొంతమంది పనికిరాని దద్దమ్మలు దళితబంధు పై విమర్శలు చేస్తున్నారు. గొర్ల పంపిణీ ప్రోగ్రాం రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడంలేదో చెప్పాలని సవాల్ విసిరారు.  చిన్న చిన్న పార్టీలు పెడితేనే జనాలు వస్తున్నారు- జనాలు రాగానే ఊగిపోవద్దు. మున్సిపల్ ఎన్నికల్లో గప్పాలు కొట్టిన బీజేపీ నేతలు ఎక్కడ పోయారు? అని ప్నశ్నించారు. మేము కూడా అన్ని విధాలుగా మాట్లాడగలుగుతాం. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయి.టీఆరెస్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అన్నారు.

Updated Date - 2021-08-11T20:46:21+05:30 IST