ఏసీ మిర్చి క్వింటా రూ. 16,200 స్వల్పంగా పెరుగుతున్న ధర
ABN , First Publish Date - 2021-06-23T05:08:30+05:30 IST
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీమిర్చి ధరలు ఊపందుకున్నాయి.
ఖమ్మం మార్కెట్, జూన్22: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీమిర్చి ధరలు ఊపందుకున్నాయి. మంగళవారం మార్కెట్లో క్వింటాలు మిర్చిని రూ.16,200 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. వారం క్రితం మార్కెట్లో ఏసీ మిర్చీ రఽకయ విక్రయాలు ప్రారంభం కాగా తొలి రోజున క్వింటాలుకు రూ. 15,000 ధర లభించింది. ఏసీ మిర్చి విక్రయాలు ప్రారంభమైన వారం రోజుల్లోనే క్వింటాలుకు రూ.1,000 పెరగడంతో కోల్డ్ స్టోరేజీలలో పంటలన నిల్వ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో సాధారణ రకం తేజా మిర్చికి క్వింటాలు రూ. 13,500 జెండాపాట ధర లభించగా వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాలు రూ.7,000 నుంచి 10,500 వరకు కొనుగోలు చేశారు. మిర్చి కొనుగోళ్ళను మార్కెట్ ఛైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ ఛైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, సెక్రెటరీ రుధ్రాక్షి మల్లేశం, గ్రేడ్టూ సెక్రెటరీ బజారు సమీక్షించారు.