ప్రత్యేక సాగుతో ప్రయోజనం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-28T11:16:38+05:30 IST
నియంత్రిత సాగు విధానంతో రైతులకు గిట్టుబాటు ధరతోపాటు అనేక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే
కేసముద్రం, మే 27 : నియంత్రిత సాగు విధానంతో రైతులకు గిట్టుబాటు ధరతోపాటు అనేక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే శంకర్నాయక్ అ న్నారు. అర్పనపల్లిలో బుధవారం నియంత్రిత సాగు విధానంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలాంటి అనేక పథకాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని వి ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల శ్రీనాధ్రెడ్డి, ఎంపీపీ వోలం చంద్రమోహన్, సర్పంచ్ గంధసిరి స్వరూప, సోమయ్య, ప్రవీణ్, మర్రి నారాయణరావు, ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో బి.వెంకన్న పాల్గొన్నారు.