వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే నేడు ప్రకటన
ABN , First Publish Date - 2020-05-31T14:46:08+05:30 IST
అనుచరులతో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సమావేశమైయ్యారు. మార్టూరులో అనుచరులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రకాశం: అనుచరులతో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సమావేశమయ్యారు. మార్టూరులో అనుచరులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మాట్లాడారు. ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ మార్పుపై ఇవాళ నిర్ణయం ప్రకటిస్తామని అనుచరులు తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళుతున్నారంటూ రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ మహానాడుకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.