టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి: ఎమ్మెల్యే నిమ్మల
ABN , First Publish Date - 2021-07-31T23:24:14+05:30 IST
టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏలూరు: టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే టిడ్కో గృహాలు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. గత రెండున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలకు ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖర్చు చేయలేదని మండిపడ్డారు. జగన్ది అసమర్థ ప్రభుత్వం అన్నారు. పాలకొల్లులో అసంపూర్తిగా నిలిచిన హిందూ స్మశాన వాటిక పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.