ఎలా వచ్చినా.... తగ్గేదేలే: ఎమ్మెల్యే రోజా
ABN , First Publish Date - 2021-12-20T22:48:58+05:30 IST
ఎవరెన్ని కష్టాలు పెట్టినా..నియోజకవర్గంలో అనగతొక్కాలని చూసినా అవమానాలు చేసినా జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు.
ప్రకాశం: ఎవరెన్ని కష్టాలు పెట్టినా..నియోజకవర్గంలో అనణగతొక్కాలని చూసినా అవమానాలు చేసినా, జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... సీఎం జగన్ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత ఊహించి ఉండరన్నారు. వైయస్సార్ చనిపోయాక తమకు తిరుగుండదనుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ముసుగు వేసుకున్న దొంగలందరూ ఒక్కటయ్యారని విమర్శించారు. అమరావతి అంటూ బ్రమరావతి మీటింగ్ పెట్టి ముసుగులు తొలగించి ఒకే వేదికపైకి వచ్చారని అన్నారు. ఎవరెవరు ప్రజల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారో తేటతెల్లం అయ్యిందన్నారు. ముసుగులు వేసుకుని వచ్చినా..తీసి వచ్చినా..ఒంటరిగా వచ్చినా...గుంపులుగా వచ్చినా వారందరూ ఎలా వచ్చినా జగనన్న తగ్గేదేలేదన్నారు.