సీఎం సహాయనిధికి వనమా, కడియం విరాళం
ABN , First Publish Date - 2020-03-26T17:37:38+05:30 IST
భద్రాద్రి: కరోనా వైరస్ నిర్మూలనకు సాయం చేసేందుకు గానూ ప్రజాప్రతినిధులంతా ముందుకొస్తున్నారు.
భద్రాద్రి: కరోనా వైరస్ నిర్మూలనకు సాయం చేసేందుకు గానూ ప్రజాప్రతినిధులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సాయం అందించగా నేడు సీఎం సహాయ నిధికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన వేతనం రూ.2.50లక్షలు, నియోజకవర్గ అభివృద్ధి నుంచి రూ.3 కోట్లను విరాళమిచ్చారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన రెండు నెలల జీతం రూ.5లక్షలను సీఎం సహాయ నిధికి అందజేశారు.