కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం!
ABN , First Publish Date - 2020-09-21T07:34:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి సరైన విధంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఎమ్మెల్సీ రాంచందర్రావు
ఎమ్మెల్సీ రాంచందర్రావు
వనపర్తి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి సరైన విధంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. భవిష్యత్తులో అందరి సూచనలను గౌరవిస్తూ కేంద్రం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం గద్వాల, నాగర్కర్నూలు, వనపర్తి జిల్లాల బీజేపీ కార్యకర్తలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో కేంద్రం వాటానే అధికంగా ఉందని చెప్పారు. డంపింగ్ యార్డులు, డబుల్బెడ్రూం ఇళ్లు వంటి పథకాలకు కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయన్నారు.