కొత్తగా ఏడు నగరాలకు ‘ఇండగో’... త్వరలో రిరన్ని సర్వీసలు...

ABN , First Publish Date - 2021-01-13T23:19:38+05:30 IST

కొత్తగా మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో నిర్ణయించిం ది. దర్భంగా, లేహ్, ఆగ్రా, కర్నూలు, బరేలీ, దుర్గాపూర్‌, రాజ్‌కోట్‌లకు ఫిబ్రవరి నుంచి విమాన సర్వీసులను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్తగా ఏడు నగరాలకు ‘ఇండగో’... త్వరలో రిరన్ని సర్వీసలు...

న్యూఢిల్లీ : కొత్తగా మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో నిర్ణయించిం ది.  దర్భంగా, లేహ్, ఆగ్రా, కర్నూలు, బరేలీ, దుర్గాపూర్‌, రాజ్‌కోట్‌లకు ఫిబ్రవరి నుంచి విమాన సర్వీసులను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందస్తుగా... ఫిబ్రవరిలో లేహ్‌, దర్భంగాకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 


ఆ తర్వాత మార్చిలో కర్నూలు, ఆగ్రా ఏప్రిల్‌లో బరేలీ, దుర్గాపూర్‌, మే నెలలో రాజ్‌కోట్‌కు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఇండిగో వెల్లడించింది. ‘ప్రస్తుతం... దేశవ్యాప్తంగా 61 దేశీయ నగరాలకు ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ సంఖ్యను 68 కి పెంచాల ని యోచిస్తున్నాం.


ఈ మేరకు రెగ్యులేటరీ అనుమ తులు తీసుకోవాల్సి ఉంది. ఆమోదం లభించి న వెంటనే ఆయా విమానాల షెడ్యూల్‌ను ప్రకటిస్తాం’ అని ఇండిగో వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచే దిశగా యోచిస్తున్నట్లు ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-01-13T23:19:38+05:30 IST