విశాఖలో దారుణం.. క్షణికానందం కోసం మూడేళ్ల చిన్నారిని చంపిన తల్లి!

ABN , First Publish Date - 2021-06-04T00:03:44+05:30 IST

మానవత్వం మంట కలిసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. క్షణికానందం కోసం కుమార్తెను కనికరం లేకుండా ఓ తల్లి చంపేసింది

విశాఖలో దారుణం.. క్షణికానందం కోసం మూడేళ్ల చిన్నారిని చంపిన తల్లి!

విశాఖ: మానవత్వం మంట కలిసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. క్షణికానందం కోసం కుమార్తెను కనికరం లేకుండా ఓ తల్లి చంపేసింది. విశాఖలో మూడేళ్ల చిన్నారి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారికవలసలో మూడేళ్ల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది.   2 రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా.. చిన్నారి మృతదేహాన్ని తల్లి వరలక్ష్మి దహనం చేసింది. చిన్నారి మృతికి తల్లి వరలక్ష్మి కారణమంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా చిన్నారి కనిపించుకుండా పోవడంతో స్థానికులు ప్రశ్నించారు.


చిన్నారి అనారోగ్యంతో మృతి చెందిందని ఆమె స్థానికులతో చెప్పింది. అయితే తమ కళ్ల ముందే తిరుగుతున్న చిన్నారి ఎప్పుడు ఆనారోగ్యానికి గురైందని వారు నిలదీశారు. ఈ నేపథ్యంలోనే తల్లి వరలక్ష్మిపై దాడి చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. వరలక్ష్మి కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, చిన్నారిని చంపేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మితో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-06-04T00:03:44+05:30 IST