రెండు వేరియంట్లలో Motorola స్మార్ట్ఫోన్స్..
ABN , First Publish Date - 2021-08-11T01:14:11+05:30 IST
అమెరికన్ ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ సంస్థ మోటరోలా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్లో అద్భుత ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ సంస్థ మోటరోలా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్లో అద్భుత ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్లో ఆగస్టు 17వ తేదీన మోటరోలా మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్ రూ. 43,600 ఉంటుందని సంస్థ వెల్లడించింది.