మున్సిపోల్స్లో టీడీపీదే విజయం: గల్లా
ABN , First Publish Date - 2021-03-08T10:30:42+05:30 IST
‘‘వైసీపీ నగరాలు, పట్టణాలను కేవలం పన్నులు బాదేసే ప్రదేశాలుగా మార్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే నగరాలు, పట్టణాలను
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నగరాలు, పట్టణాలను కేవలం పన్నులు బాదేసే ప్రదేశాలుగా మార్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే నగరాలు, పట్టణాలను అత్యంత ఆవాసయోగ్యంగా చేస్తాం. దీనికోసం సుందరీకరణ మిషన్ ఏర్పాటు చేస్తాం’’ అని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు.