ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది: కేశినేని నాని

ABN , First Publish Date - 2020-12-03T20:30:40+05:30 IST

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని..

ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది: కేశినేని నాని

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపెడుతున్నారని, ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారని ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2020-12-03T20:30:40+05:30 IST