నరసాపురం వైసీపీలో తారాస్థాయికి చేరిన విబేధాలు

ABN , First Publish Date - 2020-07-08T21:29:09+05:30 IST

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి రంగనాథరాజ్ పీఎస్ సురేష్ పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నరసాపురం వైసీపీలో తారాస్థాయికి చేరిన విబేధాలు

పశ్చిమగోదావరి: నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి రంగనాథరాజ్ పీఎస్ సురేష్ పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి రంగనాథరాజుపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు మంత్రికి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, ఎంపీపై చర్యలు తీసుకోవాలని పీఎస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-07-08T21:29:09+05:30 IST