అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధం

ABN , First Publish Date - 2020-10-21T08:29:56+05:30 IST

అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధం

అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధం

2లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తా: రఘురామకృష్ణంరాజు 


న్యూఢిల్లీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనుకునే పార్టీలన్నీ తనకు మద్దతిస్తే సీఎం అమరావతి ద్వేషి కాబట్టి ఆయన్ను ఓడించడానికి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. గత ఎన్నికల్లో ఆ ప్రాంతంలో జనసేనకు 2లక్షలు, టీడీపీకి 4లక్షలు, నరసాపురం నియోజకవర్గంలో తనకు 2లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని, తనకొచ్చిన ఓట్లు జగన్‌ పార్టీ తీసుకున్నా ఇతర ఓట్లు తనకు పడితే 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని స్పష్టంచేశారు. 

Updated Date - 2020-10-21T08:29:56+05:30 IST