అత్తింటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందని...

ABN , First Publish Date - 2021-07-03T14:10:25+05:30 IST

అత్త ఇంటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందనే కోపంతో పుట్టింటివారే ఆమెను దారుణంగా కొట్టి, చెట్టుకు వేలాడ తీసిన ఘటన...

అత్తింటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందని...

పుట్టింటి వారు దారుణానికి పాల్పడ్డారు...

అలీరాజ్‌పూర్ (మధ్యప్రదేశ్): అత్త ఇంటి నుంచి కూతురు పారిపోయి వచ్చిందనే కోపంతో పుట్టింటివారే ఆమెను దారుణంగా కొట్టి, చెట్టుకు వేలాడ తీసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన మహిళ సమీప గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త పని కోసం గుజరాత్ కు వెళ్లాడు. దీంతో భర్త వ్యవహారంపై అసంతృప్తి చెందిన భార్య అత్త ఇంటిని వదిలి పారిపోయి పుట్టింటికి వచ్చింది. భర్త ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మహిళపై కోపంతో తండ్రి, సోదరులు కలిసి ఆమెను దారుణంగా కొట్టారు. అనంతరం మహిళను చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటనను గ్రామస్థుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. పోలీసులకు విషయం తెలిసి ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి విజయ్ భగవావి చెప్పారు. 


Updated Date - 2021-07-03T14:10:25+05:30 IST