రెమ్డెసివిర్ తయారీకి మైలాన్కు అనుమతి
ABN , First Publish Date - 2020-07-03T06:43:17+05:30 IST
కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్డెసివిర్’ తయారీ కోసం మైలాన్కు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 1న
న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్డెసివిర్’ తయారీ కోసం మైలాన్కు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 1న కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో మైలాన్కు ఈ ఔషధ తయారీ, మార్కెటింగ్ అవకాశం దక్కింది. రెమ్డెసివిర్పై పేటెంట్ హక్కులు కలిగి ఉన్న గిలీడ్ సైన్సె్సతో మైలాన్ ఇప్పటికే నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రభుత్వ అనుమతి లభించడంతో ఇక ఔషధ తయారీకి మైలాన్ రెడీ అవుతోంది.