పెద్దిరెడ్డికి మతి భ్రమించింది: నాగుల్ మీరా

ABN , First Publish Date - 2021-04-11T18:55:52+05:30 IST

ఉపఎన్నికలను నిజంగా రెఫరెండం అంటే స్వచ్చంధంగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని

పెద్దిరెడ్డికి మతి భ్రమించింది: నాగుల్ మీరా

తిరుపతి: లోక్ సభ ఉపఎన్నిక నిజంగా రెఫరెండం అంటే స్వచ్చంధంగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వాలింటీర్లకు అంకితం చేయాలన్నారు. డబ్బు అహంతో ఇష్టానుసారం లక్షల్లో మెజారిటీ వస్తుందని చెబుతున్నారని, ఇప్పుడు లోకేష్, చంద్రబాబు సభలకు వస్తున్న స్పందన చూసి మంత్రి పెద్దిరెడ్డికి మతి భ్రమించిందని, ఏం మాట్లాడుతున్నారో అర్థంకావడంలేదన్నారు. తిరుపతి ప్రజలు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నాగుల్ మీరా అన్నారు.

Updated Date - 2021-04-11T18:55:52+05:30 IST