ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-08-09T01:08:43+05:30 IST
ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి.. వయసు రీత్యా, అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమన్నారు.
హైదరాబాద్: ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి.. వయసు రీత్యా, అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమన్నారు. ఒక దళిత నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో విజయవంతగా తన జీవితం గడిపారని తెలిపారు. నంది ఎల్లయ్య కుటుంబ సభ్యులకు జగ్గారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. ఒకసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు.