తిరుపతి: అలిపిరిలో నారా లోకేష్ బైఠాయింపు

ABN , First Publish Date - 2021-04-14T16:32:10+05:30 IST

తిరుపతి: అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బైఠాయించారు.

తిరుపతి: అలిపిరిలో నారా లోకేష్ బైఠాయింపు

తిరుపతి: అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బైఠాయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన కుటుంబానికి ప్రమేయం లేదని ప్రమాణం చేయడానికి అలిపిరి వద్దకు చేరుకున్నానని, తన సవాలును స్వీకరించి ముఖ్యమంత్రి జగన్ అలిపిరికి వస్తారా? అని ఎదురు చూస్తున్నట్టు నారా లోకేష్ మీడియాకు వెల్లడించారు. వారం రోజుల క్రితం సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో తిరుపతి ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ ఈ సవాల్ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-04-14T16:32:10+05:30 IST