వరదల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారు: లోకేష్
ABN , First Publish Date - 2021-11-21T17:41:47+05:30 IST
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు కనీసం ఆహారం, త్రాగునీరు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. సీఎం జగన్ గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి కక్ష సాధింపు చర్యల్లో బిజీ అయిపోయారన్నారు. అర్థరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ని అరెస్ట్ చెయ్యడంపై పెట్టిన శ్రద్ధ వాతావరణ శాఖ హెచ్చరికలో లేదన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదికాదని అన్నారు. కూన రవికుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ అన్నారు.