నరేందర్‌ మృతికి ఉత్తమ్‌, ఖుంటియా సంతాపం

ABN , First Publish Date - 2020-07-14T09:03:15+05:30 IST

టీపీసీసీ కార్యదర్శి, నగర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరేందర్‌ యాదవ్‌ మృతి పట్ల టీపీసీసీ

నరేందర్‌ మృతికి ఉత్తమ్‌, ఖుంటియా సంతాపం

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కార్యదర్శి, నగర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరేందర్‌ యాదవ్‌ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంకిత భావం కలిగిన నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. కరోనాతో క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ ఖుంటియా, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నరేందర్‌ యాదవ్‌ మృతి పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడిన వారికి సహాయం అందించడంలో నరేందర్‌ యాదవ్‌ ముందుండేవారని, ఆయన ఆకస్మిక మరణం బాధ కలిగించిందని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితరులు.. నరేందర్‌ యాదవ్‌ మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. గాంధీభవన్‌లో నరేందర్‌ యాదవ్‌ చిత్రపటానికి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-07-14T09:03:15+05:30 IST