జగన్కు ధూళిపాళ్ల నరేంద్ర లేఖ
ABN , First Publish Date - 2020-04-02T21:29:29+05:30 IST
సీఎం జగన్కు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర లేఖ రాశారు. ప్రభుత్వం వద్ద గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.30 వేల కోట్లు.. అదనంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయన్నారు.
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర లేఖ రాశారు. ప్రభుత్వం వద్ద గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.30 వేల కోట్లు.. అదనంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయన్నారు. అయినా ఉద్యోగుల వేతనాల్లో కోత ఎందుకు విధించారు? అని ప్రశ్నించారు. రైతుల నుంచి పంటల్ని ఎందుకు కొనడం లేదని నిలదీశారు. కరోనా నిర్థారణ ల్యాబ్స్కు ఎందుకు నిధులు వెచ్చించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాలోని నిధుల గురించి గోప్యత ఎందుకని మరోసారి ధూళిపాళ్ల ప్రశ్నించారు. అవసరమైతే 3 నెలల జీతాన్ని అడ్వాన్స్గా ఇవ్వాలని ప్రధాని మోదీ అన్నారని, మీరు మాత్రం జీతాల్లో కోతలు విధిస్తున్నారని లేఖలో ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు.