ధూళిపాళ్లకు కరోనా లక్షణాలు లేవు: సూపరింటెండెంట్ రాజారావు

ABN , First Publish Date - 2021-05-04T20:53:26+05:30 IST

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా లక్షణాలు లేవు.. ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు..

ధూళిపాళ్లకు కరోనా లక్షణాలు లేవు: సూపరింటెండెంట్ రాజారావు

రాజమంఢ్రి: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా లక్షణాలు లేవు.. ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని రాజమంఢ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ..  నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించి కాకినాడ ల్యాబరేటరీకు పంపించినట్లు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాకినాడ ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత చికిత్సపై తదుపరి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ రాజారావు పేర్కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం రాజమంఢ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. 


టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్యం సరిగాలేదంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ధూళిపాళ్ల జ్వరంతో బాధపడుతున్నట్లు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు.  ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు అనుమతించాలని ధూళిపాళ్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ పీపీ సమయం కోరినట్లు తెలుస్తోంది. గత రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్రను జైలు అధికారులు కోవిడ్ పరీక్షల కోసం రాజమంఢ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-05-04T20:53:26+05:30 IST