Rangareddy: నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-18T17:50:58+05:30 IST
జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేగింది.
రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేగింది. పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం పోలీసులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదుదారుల కోసం పోలీసులు స్టేషన్ ఎదురుగా ప్రత్యేక టెంట్ను ఏర్పాటు చేశారు.