నీట్ పీజీ యథాతథం
ABN , First Publish Date - 2021-04-11T12:45:53+05:30 IST
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్-2021 పీజీ పరీక్షలను ఈ నెల 18న యథాతథంగా నిర్వహించనున్నది. అయితే, కరోనా తీవ్రతదృష్ట్యా కట్టడి నిబంధనలను మరింత...
హైదరాబాద్: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్-2021 పీజీ పరీక్షలను ఈ నెల 18న యథాతథంగా నిర్వహించనున్నది. అయితే, కరోనా తీవ్రతదృష్ట్యా కట్టడి నిబంధనలను మరింత కఠినం చేసింది. పరీక్ష కేంద్రాల సంఖ్యను ఇప్పటికే పెంచింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 1.75 లక్షల మంది హాజరుకానున్నారు. పరీక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదని బోర్డు స్పష్టం చేసింది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈపా్సలు జారీ చేయనున్నట్లు తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి కూడా వేరు వేరు సమయాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వివరాలన్నీ ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించే ముందు టెంపరేచర్ పరీక్షించి, అధికంగా ఉంటే వారికి ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు.