జనవరిలో జాతీయ ప్రతిభ పరీక్ష!

ABN , First Publish Date - 2021-10-23T08:22:45+05:30 IST

జాతీయ ప్రతిభ పరీక్షను 2022 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులకు స మాచారం అందింది. ఈ పరీక్ష కోసం నవంబరు 22లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు శుక్రవారం

జనవరిలో జాతీయ ప్రతిభ పరీక్ష!

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రతిభ పరీక్షను 2022 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులకు స మాచారం అందింది. ఈ పరీక్ష కోసం నవంబరు 22లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరాని కి సంబంధించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరచే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు.


కేజీబీవీ సంస్థలు పునఃప్రారంభం

రాష్ట్రంలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాలను శుక్రవారం పునఃప్రారంభించారు. ఆ విద్యాసంస్థల్లో ఇంటర్‌ చదివే విద్యార్థులు ఈ నెల 25 నుంచి మొదటి ఏడాది పరీక్షలు రాయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-23T08:22:45+05:30 IST