చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య: నజీర్

ABN , First Publish Date - 2021-04-13T20:40:36+05:30 IST

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడిని ఖండిస్తూ నగరంలోని ఎల్ఐసీ..

చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య: నజీర్

విశాఖపట్నం: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడిని ఖండిస్తూ నగరంలోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రోద్భలంతోనే కొంతమంది దండగులు చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య అన్నారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేక ఇలాంటి  చర్యలకు వైసీపీ పాల్పడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని నజీర్ హెచ్చరించారు. చంద్రబాబుపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నజీర్  డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-13T20:40:36+05:30 IST