ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లాభం రూ.32 కోట్లు
ABN , First Publish Date - 2020-08-15T06:21:43+05:30 IST
జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రూ.32 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రూ.32 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.288 కోట్ల నుంచి రూ.261 కోట్లకు పరిమితమైంది. ఉత్పత్తిలో వినియోగించే మెటీరియల్ వ్యయాలు రూ.81.75 కోట్ల నుంచి రూ.68 కోట్లకు చేరాయి. విద్యుత్, ఇంధన వ్యయాలు కూడా తగ్గాయి.