నెల్లూరు రియల్టర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-08-07T20:09:10+05:30 IST
నెల్లూరు రియల్టర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్రెడ్డి హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు: నెల్లూరు రియల్టర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్రెడ్డి హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ అడ్డగుట్టలో విజయభాస్కర్రెడ్డి నివాసం ఉంటున్నారు. గత నెల 20న రియల్టర్ విజయభాస్కర్రెడ్డి అదృశ్యమయ్యారు. కారు నెంబర్ సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సున్నిపెంట శ్మశానవాటికలో విజయభాస్కర్రెడ్డి మృతదేహం దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.