నెల్లూరులో వెలుగులోకి వైసీపీ నేతల భూఆక్రమణ
ABN , First Publish Date - 2021-02-27T15:08:45+05:30 IST
నెల్లూరు: వైసీపీ నేతల భూఆక్రమణ నెల్లూరులోని నక్కాగోపాల్ నగర్లో వెలుగు చూసింది. రూ.7.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు వెంచర్ వేశారు.
నెల్లూరు: వైసీపీ నేతల భూఆక్రమణ నెల్లూరులోని నక్కాగోపాల్ నగర్లో వెలుగు చూసింది. రూ.7.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు వెంచర్ వేశారు. గతంలో నివాసయోగ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పట్లో పేదల ఇళ్లని అధికారులు తొలగించారు. వెంచర్లో హద్దురాళ్లని స్థానికులు తొలగించారు. భూముల జోలికి వెళ్తే కేసులు పెడతానంటూ ఎస్ఐ లక్ష్మణరావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్ఐ బెదిరింపుల ఆడియోలు ఏబీఎన్ చేతికి చిక్కాయి.