త్వరలో ఇసుక నూతన విధానం
ABN , First Publish Date - 2020-10-21T08:29:02+05:30 IST
రాష్ట్రంలో త్వరలో నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా
మంత్రుల కమిటీతో రెండోరోజూ సీఎం సమీక్ష
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండోరోజు కూడా సమీక్ష చేశారు. నూతన ఇసుక విధానంపై సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం మంగళవారం మరో దఫా మంత్రులతో చర్చించారు. ఇప్పటి కంటే తక్కువ ధరకు ఇసుక అందేలా నూతన విధానం ఉండాలన్నారు.