కొత్తగా 733 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-28T09:01:02+05:30 IST
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్లో పేర్కొంది. తాజాగా.. కృష్ణాలో ఇద్దరు, అనంతపురం,
- రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్లు
- కొవిడ్-19తో ఆరుగురి మృతి
(ఆంధ్రజ్యోతి-న్యూస్నెట్వర్క్): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్లో పేర్కొంది. తాజాగా.. కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 6,976 మంది మృతి చెందారు. కాగా, 8,47,325 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 99,13,068 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 45,715కు చేరింది. విజయనగరంలో 31 పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 40,700కు చేరుకుంది. కడప లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి.