‘సెస్’ ఆదాయం చూపించి కొత్త అప్పులు!
ABN , First Publish Date - 2021-01-26T08:57:29+05:30 IST
రోడ్ల అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధిస్తున్న రోడ్ డెవల్పమెంట్ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు తెచ్చుకోవడం కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రోడ్ల అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధిస్తున్న రోడ్ డెవల్పమెంట్ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు తెచ్చుకోవడం కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సెస్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్కు బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు, రుణ చెల్లింపులకు, కొత్త అప్పులు తేవడం కోసం వినియోగించాలని పేర్కొంది. సెస్ ఆదాయాన్ని చూపించి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవాలని ఆ కార్పొరేషన్కు సూచించింది. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ అమ్మకాలపై ప్రతీ లీటర్కి అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తున్నారు.