మూడు రోజు కొనసాగుతున్న యువతి మౌనదీక్ష
ABN , First Publish Date - 2020-08-02T10:04:15+05:30 IST
మూడు రోజు కొనసాగుతున్న యువతి మౌనదీక్ష
కామేపల్లి, ఆగస్టు 1: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనదీక్ష మూడో రోజు కొనసాగింది. మహిళా సంఘం నాయకురాళ్లతో ప్రియుడు బానోత్ దేవా ఇంటి ముందే కూర్చోని దీప్తి దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ దేవాను ఎక్కడోకో పంపించి, తన జీవితంతో జీవితంతో ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నకిలీ పత్రాలతో హోం క్వారంటైన్ అని చెప్పి తప్పించారని అన్నారు. మహిళా సంఘ నాయకురాలు ఏపూరి లతాదేవి మూడు రోజులుగా తనతోనే ఉండటం ధైర్యాన్నిచ్చిందన్నారు. పోలీసులు చొరవ తీసుకోని దేవాతో వివాహంజరిపించాలని వేడుకుంటుంది.