రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ
ABN , First Publish Date - 2021-01-21T04:26:32+05:30 IST
రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ
సంగెం, జనవరి 20: అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణానికి రూరల్ జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల సర్పంచ్లు, బీజేపీ కార్యకర్తలు, హిందూ ప్రచారక్ లు బుధవారం ముమ్మరంగా నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్రెడ్డి రూ. లక్ష విరాళాన్ని అందించారు. సంగెం మండల కేంద్రంలో సంగమేశ్వరస్వామి ఆలయంలో సంగెం, కుంటపల్లి గ్రామాల సర్పంచ్లు గుండేటి బాబు, కావటి వెంకటయ్య నిధి సేకరణ ప్రారంభించారు. ఇతర గ్రామాల్లోనూ నిధి సేకరణ కార్యక్రమం జరిగింది.