నిజాంసాగర్ ప్రాజెక్ట్ 33 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-08T13:33:14+05:30 IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరిగింది. అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ఇన్‌ఫ్లో 44,771 క్యూసెక్కులుగా

నిజాంసాగర్ ప్రాజెక్ట్ 33 గేట్లు ఎత్తివేత

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరిగింది. అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ఇన్‌ఫ్లో 44,771 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 12,652 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404.16 అడుగులు ఉంది. నిజాంసాగర్ పూర్తి స్థాయి నీటినిల్వ 17.8 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 16.5 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-08T13:33:14+05:30 IST