నిమ్మల దీక్ష విరమణ

ABN , First Publish Date - 2020-04-08T09:38:23+05:30 IST

ఇరిగేషన్‌, మత్స్య, వ్యవసాయశాఖల మంత్రులు బుధవారం ఉదయం పాలకొల్లు ఏఎంసీ వద్దకు వస్తే ఆక్వా, వరి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో క్షేత్రస్థాయికి తీసుకెళ్లి చూపిస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

నిమ్మల దీక్ష విరమణ

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 7: ఇరిగేషన్‌, మత్స్య, వ్యవసాయశాఖల మంత్రులు బుధవారం ఉదయం పాలకొల్లు ఏఎంసీ వద్దకు వస్తే ఆక్వా, వరి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో క్షేత్రస్థాయికి తీసుకెళ్లి చూపిస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. 24 గంటలపాటు తన నివాసంలో చేపట్టిన నిరశన దీక్ష మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. రైతులు ఎమ్మెల్యేకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

Updated Date - 2020-04-08T09:38:23+05:30 IST